ఈ లవంగం గారిని ఇలాగే వదిలెయ్యకండి అంటూ బండి సంజయ్ ఫై కేటీఆర్ ట్వీట్

తెలంగాణ రాష్ట్రంలో బిజెపి vs టిఆర్ఎస్ వార్ నడుస్తుంది. రాబోయే ఎన్నికలను టార్గెట్ గా పెట్టుకున్న బిజెపి కేసీఆర్ ఫ్యామిలీ ఫై టిఆర్ఎస్ పార్టీ తీరు ఫై విమర్శలు , ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. వారి విమర్శలకు అంతే దీటుగా టిఆర్ఎస్ నేతలు సమాదానాలు ఇస్తూ వస్తున్నారు. ఈ తరుణంలో కేసీఆర్ ఫాంహౌజ్ లో సకుటుంబ సమేతంగా తాంత్రిక పూజలు చేసిండని.. ఆ పూజల అనంతరం వాటిని కాళేశ్వరం పోయి ఆ నీళ్లలో కలిపిండు. పైకి మాత్రం కాళేశ్వరం ప్రాజెక్టును పరిశీలించేందుకు వెళుతున్నానని చెప్పిండు అంటూ బండి సంజయ్ ట్వీట్ చేశారు.

బండి సంజయ్‌ చేసిన ట్వీట్‌ కు కేటీఆర్ కౌంటర్‌ ఇచ్చారు. ‘‘ఈ లవంగం గారిని ఇలాగే వదిలెయ్యకండి రా బీజేపీ బాబులు. పిచ్చి ముదిరి తొందర్లో కరవడం మొదలు పెడతాడేమో; మతి లేని మాటలతో సమాజానికి ప్రమాదకరంగా తయారయ్యాడు. ఎర్రగడ్డలో బెడ్ తయారుగ ఉంది. తొందరగా తీసుకెళ్లి వైద్యం చేయించుకోండి’’ అని ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ సోషల్ మీడియా లో వైరల్ గా చక్కర్లు కొడుతున్నాయి.