రేపు మునుగోడు, హుజుర్‌న‌గ‌ర్‌లో ప‌ర్య‌టించ‌నున్న మంత్రి కేటీఆర్

బిఆర్ఎస్ మంత్రి కేటీఆర్ రేపు (జనవరి 06) మునుగోడు, హుజుర్‌న‌గ‌ర్‌లలో పర్యటించనున్నారు. మునుగోడు ఉప ఎన్నిక సమయంలో మునుగోడు ను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించిన కేటీఆర్..ఆ తర్వాత ఇచ్చిన మాట ప్రకారం మునుగోడు అభివృద్ధి ఫై ఫోకస్ పెట్టారు. ఉప ఎన్నిక తర్వాత ఓసారి మునుగోడు వచ్చి పలు అభివృద్ధి పనుల ఫై అధికారులతో సమీక్ష జరిపి పలు నిధులు విడుదల చేయడం జరిగింది.

ఇక రేపు శుక్రవారం విద్యుత్ శాఖ మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డితో క‌లిసి శుక్రవారం హుజుర్‌న‌గ‌ర్‌, మునుగోడు నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు మంత్రులు శంకుస్థాప‌న‌లు, ప్రారంభోత్స‌వాలు చేయ‌నున్నారు. దీనికి సంబదించిన షెడ్యూల్ ను విడుదల చేసారు.

  • ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి.. ఉదయం 10:50 గంటలకు హుజూర్ నగర్ పట్టణానికి చేరుకుంటారు.
  • ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు హుజూర్ నగర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్ద స్థానిక ఎమ్మెల్యే సైదిరెడ్డితో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు.
  • మధ్యాహ్నం 12:30 గంటలకు గ్రీన్ వుడ్ స్కూల్ వద్ద ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొంటారు.
  • మధ్యాహ్నం 1:45 గంటలకు హుజూర్ నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డి నివాసంలో లంచ్ చేస్తారు.
  • మధ్యాహ్నం 2:30 గంటలకు హుజూర్ నగర్ పట్టణం నుంచి హెలికాఫ్టర్‌లో బయలుదేరి.. మధ్యాహ్నం 3 గంటలకు మునుగోడు నియోజకవర్గంలోని చండూర్ టౌన్‌కు చేరుకుంటారు.
  • మధ్యాహ్నం 3:30 గంటలకు గట్టుప్పల్ మండల కేంద్రంలో క్లస్టర్ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాంను ప్రారంభిస్తారు.
  • సాయంత్రం 4:30 గంటలకు చండూరు పట్టణానికి చేరుకుంటారు. అనంతరం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు.
  • సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ తిరిగి ప్రయాణం అవుతారు.