నేడు కర్నల్‌ సంతోష్‌బాబు విగ్రహాన్ని ఆవిష్కరించనున్న కేటీఆర్‌

హైదరాబాద్: ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ కర్నల్‌ సంతోష్‌ బాబు కాంస్య విగ్రహాన్ని నేడు మధ్యాహ్నం ఆవిష్కరించనున్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన సంతోష్‌బాబు వీరోచిత పోరాట స్ఫూర్తి ఎప్పటికీ గుర్తుండిపోయేలా సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆయన కాంస్య విగ్రహాన్ని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.


కాగా, భారత్‌-చైనా సరిహద్దులో విధులు నిర్వర్తిస్తూ భారతావని కోసం వీరోచితంగా పోరాడి కర్నల్‌ సంతోష్‌ బాబు అమరుడయ్యారు. లద్దాఖ్‌లో వాస్తవాధీన రేఖ వెంట గతేడాది జూన్‌ 15న చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో సూర్యాపేటకు చెందిన సంతోష్‌బాబుతో పాటు కొందరు సైనికులు అమరులైన విషయం తెలిసిందే.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/