తెలంగాణ ఓటర్లకు కెటిఆర్ కృతజ్ఞతలు
తిరుగులేని విజయం అందించారని వ్యాఖ్యలు
హైదరాబాద్: తెలంగాణ మున్సిపల్ ఎన్నికలో దూసుకుపోయన టిఆర్ఎస్ 120 మున్సిపాలిటీలు, 9 మున్సిపల్ కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల్లో టిఆర్ఎస్ జయభేరి మోగించింది. 100కి పైగా మున్సిపాలిటీల్లో గులాబీ పార్టీకి ఎదురులేకుండా పోయింది. ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. కెసిఆర్ గారి నాయకత్వంపై మరోసారి ప్రగాఢ నమ్మకం ఉంచినందుకు తెలంగాణ ప్రజానీకానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని ట్విట్టర్ లో స్పందించారు. మున్సిపల్ ఎన్నికల్లో తిరుగులేని విజయం అందించారని కొనియాడారు. 100కి పైగా మున్సిపాలిటీలు, తొమ్మిదింటికి తొమ్మిది మున్సిపల్ కార్పొరేషన్లలో విజయం మామూలు విషయం కాదని పేర్కొన్నారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/