పోలీసులకు కు వార్నింగ్ ఇచ్చిన మజ్లిస్‌ కార్పొరేటర్ ఫై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్‌ ఆదేశం

హైదరాబాద్‌లో రాత్రివేళ హోటళ్లు నడిపేందుకు పర్మిషన్ లేదని చెప్పిన పోలీసులకు..బోలక్ పూర్ ఎంఐఎం కార్పోరేటర్ వార్నింగ్ ఇచ్చిన ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటన ఫై మంత్రి కేటీఆర్‌ సీరియస్ అయ్యారు. వెంటనే బోలక్ పూర్ ఎంఐఎం కార్పోరేటర్ ఫై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి కి ఆదేశాలు జారీచేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగిస్తే సహించేది లేదని , తెలంగాణలో ఇలాంటి వాటిని సహించేది లేదని హెచ్చరించారు. ఏ రాజకీయ పార్టీతో సంబంధం ఉన్నా వారిని వదలకూడదు అని స్పష్టం చేశారు మంత్రి కేటీఆర్.

అసలు ఏంజరిగిందంటే.. మంగళవారం రాత్రి నాలుగు గంటల ప్రాంతంలో పెట్రోలింగ్ పోలీసులు పెట్రోలింగ్ చేస్తున్న క్రమంలో హోటల్ ఓపెన్ ఓపెన్ చేసి ఉండడం తో హోటల్ మూసివేయాలని , హైదరాబాద్‌లో రాత్రివేళ హోటళ్లు నడిపేందుకు పర్మిషన్ లేదని పోలీసులు చెప్పడం తో..కార్పొరేటర్ గౌసుద్దీన్ తాహా పోలీసులతో గొడవకు దిగాడు. కనీస మర్యాద కూడా లేకుండా నోటికి ఎంత వస్తే అంత మాట అనేశాడు. రంజాన్‌ నెల మొత్తం హోటళ్లు, షాపులను ముషిరాబాద్ ప్రాంతంలో తెరిచే ఉంచుతామంటూ..ఇక్కడకు కార్పొరేటర్‌ గౌసుద్దీన్‌ వచ్చాడని.. మీ ఎస్‌ఐ, సీఐకి చెప్పండి అంటూ సినిమా డైలాగ్స్ పేల్చాడు. రంజాన్ నెలపాటు ఇటు వైపు రావొద్దంటూ పోలీసులకు హెచ్చరించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది.

Request @TelanganaDGP Garu to take stern action against the individuals who obstructed police officers on duty

No such nonsense should be tolerated in Telangana irrespective of political affiliations https://t.co/zLbxa8WZW2— KTR (@KTRTRS) April 6, 2022