మునుగోడు నామినేషన్‌ ర్యాలీలో మంత్రి కెటిఆర్ కు ఘనస్వాగతం

హైదరాబాద్ః నల్గొండ జిల్లా మునుగోడు ఉపఎన్నికలకు… నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ఇప్పటివరకు 32 మంది అభ్యర్థులు… 52 సెట్ల నామినేషన్లు దాఖలు చేసినట్లు అధికారులు వెల్లడించారు. కాసేపట్లో టిఆర్‌ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు. టిఆర్‌ఎస్‌ అభ్యర్థి నామినేషన్‌ దాఖలుకు కెటిఆర్ హాజరవుతున్నారు. బంగారిగడ్డ నుంచి చండూరు వరకు తెరాస భారీ ర్యాలీ చేపడుతోంది. ఈ ర్యాలీలో తెరాస అభ్యర్థి కూసుకుంట్ల వెంట పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు కెటిఆర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

కాగా, ఇప్పటికే బిజెపి అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డి భారీ హంగామా నడుమ నామినేషన్ దాఖలు చేశారు. భారీగా తరలివచ్చిన అగ్రనాయకత్వం, కార్యకర్తలు, అభిమానులతో కలిసి కోమటిరెడ్డి ర్యాలీగా బయలుదేరారు. బంగారి గడ్డ నుంచి ఆర్వో కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేశారు. కోమటిరెడ్డి వెంట తరుణ్ చుగ్, సునీల్ బన్సల్, కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్‌, రఘునందన్‌రావు, వెంకటస్వామి, మనోహర్‌రెడ్డి, ఏనుగు రవీందర్‌రెడ్డి ఉన్నారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/