కోవిడ్ రెస్సాన్స్ వెహికిల్స్ను ప్రారంభించిన కెటిఆర్
గత వారం హామీ ఇచ్చినట్టుగానే ఆరు కోవిడ్ రెస్పాన్స్ వెహికిల్స్ అందజేత
హైదరాబాద్: మంత్రి కెటిఆర్ తన పుట్టినరోజు సందర్భంగా ప్రభుత్వానికి అంబులెన్స్లను అందిస్తామని పేర్కొన్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో కెటిఆర్ ఆరు కోవిడ్ రెస్సాన్స్ అంబులెన్స్లను గురువారం ప్రారంభించారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. వీటిని ఆరోగ్యశాఖ మొదట కోవిడ్ రెస్పాన్స్ వెహికిల్స్గా వాడినప్పటికీ తరువాత అంబులెన్స్లుగా వినియోగిస్తుందని కెటిఆర్ తెలిపారు. ‘ఆరు వాహనాలను అందించడం ఆనందంగా ఉంది. ఆరోగ్యశాఖా మంత్రి ఈటల రాజేందర్ గారి పర్యవేక్షణలో ఆరోగ్య శాఖ వీటిని మొదట ‘కోవిడ్ రెస్పాన్స్ వెహికల్స్’ గా వాడుతుంది. ఆ తరువాత అంబులెన్స్లుగా వినియోగిస్తుంది. గత వారం నేను ప్రకటించినట్టుగానే ఇది నా శక్తి మేరకు నేనందిస్తున్న వ్యక్తిగత కాంట్రిబ్యూషన్’ అని కెటిఆర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్తోపాటు మంత్రి ఈటల రాజేందర్, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/business/