‘భీమ్లానాయ‌క్’ ప్రీరిలీజ్.. గెస్ట్ గా కేటీఆర్

సోమవారం పోలీస్ గ్రౌండ్స్ లో ఈవెంట్

హైదరాబాద్: జనసేనాని పవన్ కల్యాణ్ తాజా చిత్రం ‘భీమ్లా నాయక్’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది. హిందీలో సైతం ఈ చిత్రం విడుదల కాబోతోంది మరోవైపు ఈ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ సోమవారం జరగనుంది. హైదరాబాదులోని పోలీస్ గ్రౌండ్స్ లో ఈ కార్యక్రమం అట్టహాసంగా జరగబోతోంది. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్టుగా తెలంగాణ మంత్రి కేటీఆర్ వస్తున్నారు.

ఈ వార్తతో ఇటు పవన్ అభిమానులు, అటు టీఆర్ఎస్ శ్రేణులు ఆనందంలో మునిగిపోయాయి. ఈ చిత్రంలో రానా మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. హీరోయిన్లుగా నిత్యామీనన్, సంయుక్తా మీనన్ లు నటించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ అందించారు. తమన్ సంగీతాన్ని అందించగా సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించారు. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/