కెటిఆర్కు మరో అంతర్జాతీయ సంస్థ ఆహ్వానం
హైదరాబాద్: టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ దావోస్ వేదికగా తెలంగాణ ఖ్యాతిని 117 దేశాల ముందు ఆవిష్కరించిన విషయం తెలిసిందే. అయితే కెటిఆర్కు మరో అంతర్జాతీయ సంస్థ నుంచి ఆహ్వానం అందింది. అమెరికాలోని నెవెడాలో ఈ ఏడాది మే 17 నుంచి 21 వరకు జరిగే ప్రపంచ పర్యావరణ, జలవనరుల సదస్సులో ముఖ్య వక్తగా పాల్గొనాలని కోరుతూ ఈడబ్ల్యూఆర్ఐ (వరల్డ్ ఎన్విరాన్మెంట్, వాటర్ రిసోర్స్ కాంగ్రెస్) ఆహ్వానం పంపింది. ఈ సదస్సులో పాల్గొనేందుకు కేటీఆర్ సమ్మతిస్తూ వర్షం వ్యక్తం చేశారు. ప్రపంచం నలుమూలల నుంచి దాదాపు 1,200 మంది ఇంజినీర్లు, శాస్త్రవేత్తలు ఈ సదస్సులో పాల్గొననున్నారు. పర్యావరణం, జలనవరుల నిర్వహణలో ప్రపంచ వ్యాప్తంగా అమలవుతున్న అత్యుత్తమ ప్రమాణాల గురించి ఈ సదస్సులో చర్చిస్తారు. తాజా అధ్యయన నివేదికలు, పలు కేస్ స్టడీలు విశ్లేషించనున్నారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/