తెలంగాణ భవన్ లో జెండా ఎగురవేసిన కేటీఆర్
టీఆర్ఎస్ పార్టీ 21 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గులాబీ జెండాను ఆవిష్కరించారు. 40 ఫీట్ల జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రులు మహముద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్తో పాటు టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. జెండా ఆవిష్కరణ అనంతరం కేటీఆర్ కేక్ కట్ చేశారు.
ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నగరంలోని మాదాపూర్ హెచ్ఐసీసీ వేదిక గులాబీ మయంగా మారింది. నగరంలో ఎక్కడ చూసిన కేసీఆర్, కేటీఆర్ కటౌట్లను ఏర్పాటు చేశారు టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు. ప్లీనరీ వేదిక వద్ద పోలీసులు అత్యంత కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. మొత్తం 2500 మంది పోలీస్ సిబ్బందితో భద్రతను ఏర్పాటు చేశారు. హెచ్ఐసీసీ వేదిక కు కేసీఆర్ హాజరయ్యారు. హెచ్ఐసీసీ అంత కూడా నేతలతో సందడి గా మారింది.