వాణిజ్యశాఖ పార్లమెంటరీ స్థాయీ సంఘం భేటీ.. కేటీఆర్ హాజరు
విజయసాయిరెడ్డి నేతృత్వంలో హైదరాబాదులో పార్లమెంటరీ స్థాయీ సంఘం భేటీ
హైదరాబాద్: విజయసాయిరెడ్డి నేతృత్వంలో హైదరాబాద్లోని అసెంబ్లీ కమిటీ హాల్లో వాణిజ్య శాఖ పార్లమెంటరీ స్థాయీ సంఘం సమావేశమైంది. ఇందులో తెలంగాణ, ఏపీ అధికారులు, వాణిజ్య రంగ ప్రతినిధులు పాల్గొంటున్నారు. తెంలగాణ నుంచి మంత్రి కేటీఆర్, సీఎస్ సోమేశ్ కుమార్, ఎంపీలు నామా నాగేశ్వరరావు, డి.శ్రీనివాస్, ధర్మపురి అర్వింద్ హాజరయ్యారు. ఏపీ నుంచి మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఫిక్కి, ఎస్బీఐ, ఫార్మా రంగ ప్రతినిధులు, పలువురు అధికారులు, తదితరులు పాల్గొన్నారు. ఈ-కామర్స్ రంగానికి ప్రోత్సాహం, నియంత్రణ వంటి అంశాలపై చర్చిస్తున్నారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/