‘శ్యామ్ సింగ రాయ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కృతి శెట్టి తన మాటలతో ఫిదా చేసింది

నాని , సాయిపల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్ జంటగా రాహుల్ సంక్రిత్యాన్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న చిత్రం శ్యామ్ ​సింగ రాయ్. భారీ అంచనాల మధ్య తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈనెల 24న రిలీజ్ చేయబోతున్నారు. ఈ క్రమంలో చిత్ర యూనిట్ మంగళవారం హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను అట్టహాసంగా నిర్వహించారు.

ఈ సందర్బంగా హీరోయిన్ కృతి శెట్టి తెలుగులో మాట్లాడి అందర్నీ ఫిదా చేసింది. “నాని అంటే నాకే కాదు మా ఫ్యామిలీలో అందరికీ చాలా ఇష్టం. రెండవ సినిమాతోనే నానితో కలిసి నటించే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నాని గారి నుంచి నేను ఎన్నో విషయాలను నేర్చుకున్నాను. ఆయనతో కలిసి పనిచేయడం చాలా హ్యాపీగా అనిపించింది.

రాహుల్ గారికి ఇది రెండవ సినిమా. అయినా ఎక్కడా కూడా అలా అనిపించలేదు. తన వర్క్ కి సంబంధించిన ఆయన చాలా కాన్ఫిడెంట్ గా కనిపించే వారు. ఈ సినిమాలో నా పాత్ర పేరు కీర్తి .. మిమ్మల్ని తప్పకుండా ఆకట్టుకుంటుందని అనుకుంటున్నాను. అందరూ కూడా మాస్క్ పెట్టుకుని థియేటర్ కి వెళ్లి ఈ సినిమాను చూడండి .. ఈ సినిమా తప్పకుండా మీకు ఒక విజువల్ ట్రీట్ ఇస్తుంది” అని చెప్పుకొచ్చింది.