ఆ కోరిక తీరకుండానే మృతి చెందిన కృష్ణం రాజు
రెబెల్ స్టార్ కృష్ణం రాజు ఇకలేరు అనే విషయాన్నీ తట్టుకోలేకపోతున్నారు అభిమానులు. దాదాపు 200 చిత్రాలతో సినీప్రేక్షకులను అలరించిన ఆయన..చివరగా రాధేశ్యామ్ తో కనువిందు చేసారు. రాబోయే రోజుల్లో ప్రభాస్ తో మరిన్ని సినిమాలు చేస్తారని అంత అనుకుంటున్నా సమయంలో సడెన్ గా ఆయన చనిపోయారని వార్త ఎవరు తట్టుకోలేకపోతున్నారు.
ఇక ఆయన నట వారసుడిగా సినీ ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ పాన్ ఇండియా స్టార్గా ఎదిగారు. ప్రభాస్ తొలి చిత్రం ఈశ్వర్ నుంచి ప్రభాస్ విషయంలో కృష్ణంరాజు ఎంతో కేర్ తీసుకున్నారు. పెద్దనాన్న అంటే ప్రభాస్కు ఎంతో ఇష్టం. ఆయనతో కలిసి రెబల్ , బిల్లా , రీసెంట్గా విడుదలైన రాధే శ్యామ్ లోనూ కృష్ణంరాజుతో ప్రభాస్ కలిసి నటించారు.అయితే కృష్ణం రాజు కు ప్రభాస్కి సంబంధించిన ఓ విషయంలో మాత్రం కోరిక నేరవేరలేదు.
నాలుగు పదులు వయసు వచ్చినప్పటికీ ప్రభాస్ పెళ్లి చేసుకోలేదు. ప్రభాస్కు తగ్గ అమ్మాయిని వెతుకుతున్నామని, ప్రభాస్ పెళ్లి చేసుకుంటే ఆయన పిల్లల్ని ఎత్తుకుని ఆడించానలనే కోరిక ఉన్నట్లు కృష్ణంరాజు కొన్ని సందర్భాల్లోనూ చెప్పారు. ప్రభాస్ పెళ్లి చేసుకుంటే చూడాలని ఎంతో ఆశ పడ్డారు. కానీ ఆ కోరిక తీరకుండానే ఆయన కన్నుమూశారు.
గత కొద్దీ రోజులుగా అనారోగ్యం తో బాధపడుతున్న ఈయన ఈరోజు ఆదివారం ఉదయం 3.25 నిమిషాలకు తుదిశ్వస విడిచారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు. ఆయన కేంద్ర మంత్రిగా పని చేశారు. 1940 జనవరి 20న పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో జన్మించారు. 187 చిత్రాల్లో నటించారు. 1966లో చిలకా గోరింక చిత్రంతో హీరోగా తెలుుగ చిత్రసీమలోకి అడుగు పెట్టారు. ఇండస్ట్రీలో రెబెల్ స్టార్గా క్రేజ్ తెచ్చుకున్న కృష్ణంరాజు పూర్తి పేరు ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు.