జలసౌధలో కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశం

Jalasoudha
Jalasoudha

Hyderabad: కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశం ప్రారంభమైంది. హైదరాబాద్‌లోని జలసౌధలో కృష్ణా బోర్డు ఛైర్మన్‌ ఆర్కే గుప్తా అధ్యక్షతన సమావేశం జరుగుతోంది. సమావేశానికి తెలగాణ సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, ఏపీ స్పెషల్‌ సీఎస్‌ ఆదిత్యనాథ్‌ లతో పాటు ఇరు రాష్ట్రాల ఇరిగేషన్‌ ఈఎన్సీలు, ఇంజనీర్‌లు హాజరయ్యారు. ఇప్పటి వరకు వాడుకున్న నీటి లెక్కలు, టెలిమెట్రి అమలు, కృష్ణా నది యాజమాన్య బోర్డుకు నిధుల కేటాయింపులపై సమావేశంలో చర్చిస్తున్నారు.