రేపు టీఆర్ఎస్లో చేరనున్న కౌశిక్రెడ్డి
రేపు కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోనున్న కౌశిక్ రెడ్డి
హైదరాబాద్ : హుజూరాబాద్ నేత పాడి కౌశిక్రెడ్డి టీఆర్ఎస్ లో చేరబోతున్నారు. రేపు మధ్యాహ్నం ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరుతానని ఆయన ప్రకటించారు. హుజురాబాద్ నియోజకవర్గ అభివృద్ధి కోసమే టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నానని కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు.
కొండాపూర్లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కౌశిక్ రెడ్డి ఈ విషయాన్ని వెల్లడించారు. హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు, తన మద్దతుదారుల కోరిక మేరకు.. టీఆర్ఎస్లో చేరాలని నిర్ణయించుకున్నాను. కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితుడిని అయ్యాను. సీఎం కేసీఆర్ పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారు.
తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/andhra-pradesh/