ఫోన్ ట్యాపింగ్ పై కేంద్రానికి పిర్యాదు చేస్తా – వైస్సార్సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

గత కొద్దీ రోజులుగా వైస్సార్సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేరు వార్తల్లో నిలుస్తుంది. సొంత పార్టీ పైనే విమర్శలు చేస్తూ హాట్ టాపిక్ అవుతున్నారు. ఇక రెండు రోజులుగా తన ఫోన్ ను ట్యాపింగ్ చేస్తున్నారని మీడియా ముందుకు వచ్చి తన ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. తన ఫోన్ ట్యాపింగ్ పై ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు తనతో మాట్లాడారని శ్రీధర్ రెడ్డి చెప్పుకొచ్చారు.

తన ఫోన్ ట్యాపింగ్ పై కేంద్రానికి పిర్యాదు చేస్తానని అన్నారు. ఎమ్మెల్యేల మీద ట్యాపింగ్ తో ఆగదన్నారు. ఐఏఎస్ లు, ఐపీఎస్ లు, న్యాయమూర్తుల మీద కూడా చేస్తారన్నారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ ఫోన్ ను కూడా ట్యాపింగ్ చేస్తారన్నారు. ఫోన్ ట్యాపింగ్ ఒక్క ఎమ్మెల్యేతో ఆగిపోదన్నారు. తన ఫోన్ ను దొంగచాటుగా వినలేదని నిరూపించగలరా అని ప్రశ్నించారు. నా జీవితంలో ఇలాంటి ప్రెస్ మీట్ పెట్టాల్సి వస్తుందని అనుకోలేదన్నారు. భవిష్యత్తు కార్యాచరణ ఏంటనేది త్వరలోనే ప్రకటిస్తానన్నారు. ఇన్ని రోజులు వైఎస్ అభిమానంతో అవమానాలు భరించానన్నారు. తన ఫోన్ ట్యాపింగ్ చేస్తారని ఊహించలేదన్నారు. వైస్సార్సీపీ నుంచి పోటీచేయదల్చుకోలేదన్నారు.