టిఆర్ఎస్ ను ఢీకొట్టే దమ్ము ఒక్క బిజెపికే ఉంది – కొండా విశ్వేశ్వర్ రెడ్డి

కేసీఆర్ ను అడ్డుకోవడం ఒక్క బీజేపీకే సాధ్యమని, టీఆర్ఎస్ ను ఢీకొట్టే సత్తా ఒక బిజెపికి మాత్రమే ఉందని..మారే ఇతర పార్టీలకు లేదని అన్నారు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి. రీసెంట్ గా హైదరాబాద్ లో జరిగిన నిజేపీ జాతీయ కార్యనిర్వహణ సమావేశాల్లో బిజెపి తీర్థం పుచ్చుకున్న కొండా..మొదటిసారి హైదరాబాద్ లోని బిజెపి పార్టీ రాష్ట్ర కార్యాలయంలో అడుగుపెట్టారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ ను అడ్డుకోవడం ఒక్క బీజేపీకే సాధ్యమని, టీఆర్ఎస్ ను ఢీకొట్టే సత్తా ఇతర ఏ పార్టీలకు లేదని అన్నారు. ప్రజలకు ఎక్కడ న్యాయం జరుగుతుందంటే తాను అక్కడే ఉంటానన్నారు. తాను నెలకు ఒక్క లీడర్ ను అయినా బీజేపీకిలోకి తీసుకొస్తానని తేల్చి చెప్పారు. ‘టీఆర్ఎస్ లో మూడు విధానాలు నడుస్తున్నాయి. ఒకరు కాళ్లు మొక్కించుకోవడం, మరొకరు డబ్బులు తీసుకోవడం, ఇంకొకరు కేసులతో బెదిరించడం’ అని కొండా అన్నారు. తాను బీజేపీలో చేరే విషయం కాంగ్రెస్ నేతలందరికీ ముందుగానే తెలుసనీ చెప్పుకొచ్చారు.

ఇక బిజెపి కార్యాలయానికి వెళ్లిన కొండా..అక్కడ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను కలిశారు. ఈ సందర్భంగా కొండా విశ్వేశ్వర్ రెడ్డిని బండి సంజయ్ సన్మానించారు. ఇన్నాళ్లు తాను ఏ పార్టీకి మద్దతుగా లేనని, అందుకే తనను ఎవరూ పట్టించుకోలేదని చెప్పారు. బీజేపీలో చేరిన తర్వాత చాలా మంది అడుగుతున్నారని తెలిపారు.

అక్కడ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను కలిశారు. ఈ సందర్భంగా కొండా విశ్వేశ్వర్ రెడ్డిని బండి సంజయ్ సన్మానించారు. ఇన్నాళ్లు తాను ఏ పార్టీకి మద్దతుగా లేనని, అందుకే తనను ఎవరూ పట్టించుకోలేదని చెప్పారు. బీజేపీలో చేరిన తర్వాత చాలా మంది అడుగుతున్నారని అన్నారు