సూర్యాపేట జిల్లా ఎస్పీపై కోమటిరెడ్డి ఫైర్

సూర్యాపేట జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్‌ ఫై కాంగ్రెస్ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు. మీరు ప్రభుత్వ ఉద్యోగా.. టీఆర్ఎస్ కార్యకర్త అని ప్రశ్నించారు. మంత్రి జగదీశ్ రెడ్డి ని బాహుబలితో ఎస్పీ పోల్చడం ఏంటి అని అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో మంత్రి జగదీశ్ రెడ్డితో పాటు జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు.

ఈ సందర్భాంగా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. మంత్రి జగదీష్ రెడ్డిని ఉద్దేశిస్తూ ‘జయహో జగదీశ్ రెడ్డి’ అంటూ సభకు వచ్చిన వారితో నినాదాలు చేయించారు. అంతే కాకుండా మంత్రి జగదీశ్ రెడ్డి ని బాహుబలి అంటూ ఎస్పీ సంబోధించారు. ఎస్పీ ఇలా అనడం ఫై సర్వత్రా చర్చ గా మారింది. దీనిపై శనివారం భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి యాదగిరిగుట్టలో మీడియాతో మాట్లాడుతూ… ఇసుక దందాలు, ప్రభుత్వ భూముల ఆక్రమణలు, హత్య కేసుల్లో నిందితుడైన మంత్రి జగదీశ్‌రెడ్డిని బాహుబలితో పోల్చుతూ ఎస్పీ రాజేంద్రప్రసాద్ పోలీసు శాఖకే మచ్చ తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేసారు. దీనికి నైతిక బాధ్యత వహించి ఆయనే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ఆయన్ని సస్పెండ్‌ చేయకపోతే పోలీసులను పెట్టి అధికారం ఏలుతున్నారనే అపవాదు ముఖ్యమంత్రి కేసీఆర్‌కే వస్తుందని హెచ్చరించారు.