తనకు రక్షణ కల్పించాలంటూ కోర్ట్ ను ఆశ్రయించిన కోమటిరెడ్డి రాజగోపాల్

మాజీ ఎమ్మెల్యే , బిజెపి నేత కోమటిరెడ్డి రాజగోపాల్..మంగళవారం తెలంగాణ హైకోర్టు ను ఆశ్రయించారు. తన ప్రాణాలకు ముప్పు ఉందని, తనకు రక్షణ కల్పించేలా పోలీసులకు స్పష్టమైన ఆదేశాలను ఇవ్వాలని కోర్ట్ ను కోరారు. వాదనలు విన్న న్యాయస్థానం.. రెండు వారాల్లో రాజగోపాల్ రెడ్డికి భద్రత కల్పించాలని ఆదేశించింది. 2+2 సెక్యూరిటీ కల్పించాలని రాష్ట్ర డీజీపీ, ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.

గత ఏడాది కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కోమటిరెడ్డి బీజేపీలో చేరారు. ఆ తర్వాత జరిగిన మునుగోడు ఉపఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి గట్టి పోటీ ఇచ్చినప్పటికీ , బిఆర్ఎస్ చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన కాస్త నెమ్మదించారు. ఇలాంటి పరిస్థితుల్లో తనకు ప్రాణ హాని ఉందంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించడం ఇప్పుడు ఆయన్ను వార్తల్లో నిలిచేలా చేసింది.