మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్

టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు మచిలీపట్నంలో అరెస్ట్ చేశారు. కోట్లాది రూపాయిలు విలువ చేసే ప్రభుత్వ భూమిని వైస్సార్సీపీ పార్టీ కార్యాలయానికి కేటాయించారంటూ కొల్లు రవీంద్ర, కొనకళ్ల బల్లయ్య ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. కాగా ఈ నిరసన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు.

ఈ సందర్భంగా వైస్సార్సీపీ కార్యాలయ స్థలాన్ని మీడియాకు చూపేందుకు కొల్లు రవీంద్ర ప్రయత్నించారు. అయితే దీనికి పోలీసులు ఒప్పుకోలేదు. అలాగే, కొల్లు రవీంద్రను అడ్డుకున్న పోలీసులు.. బల్లయ్యను అరెస్ట్ చేశారు. అయితే పోలీసుల చర్యలను కొల్లు రవీంద్ర, టీడీపీ నాయకులు, కార్యకర్తలు ప్రతిఘటించారు. ఈ క్రమంలో పరిస్థితి అదుపు తప్పడంతో కొల్లు రవీంద్రను కూడా పోలీసులు అరెస్టు చేసి, గూడూరు వైపు తరలించారు. కొల్లు రవీంద్ర అరెస్ట్ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.