కోహ్లీ ఆటను చూడడానికి ఎక్కువగా ఇష్టపడతా
ఇంగ్లండ్ మాజి సారధి నాజర్ హుస్సేన్
లండన్: ఇంగ్లండ్ అత్యంత విజయవంతమైన సారధి నాజర్ హుస్సేన్ భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ పై ప్రశంశలు కురిపించాడు. డేయిలి మేయిల్తో తన అభిప్రాయలను పంచుకుంటున్న నాజర్, గతంలో ఎవరి ఆటను చూడడానికి ఎక్కువగా ఇష్ట పడతారని అనే ప్రశ్న ఎదురైంది. దీనికి సమాధానంగా అందరికంటే ముందుగా విరాట్ కోహ్లీ ఆటను చూడడానికి ఇష్టపడతా..అతడే అత్యుత్తమ బ్యాట్స్మన్ అని నాజర్ తెలిపాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో లక్ష్య చేధన సమయంలో కోహ్లీ బ్యాటింగ్ చేసే తీరు అద్బుతంగా ఉంటుంది. ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు సాగుతాడు . అలాగే తన వ్యక్తిగత రికార్డులకు ఏనాడు ప్రాధాన్యం ఇవ్వడు. కేవలం జట్టు గెలిచిందా లేదా అనేది మాత్రమే అతడికి ముఖ్యం అని హుస్సేన్ అన్నాడు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/