జనసేనకు డిపాజిట్లు కూడా దక్కవు
పవన్ కళ్యాణ్ పై మంత్రి కొడాలి నాని తీవ్ర విమర్శలు
Amaravati: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై మంత్రి కొడాలి నాని తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆదివారం అయన మీడియా తో మాట్లాడారు. రాష్ట్రంలో పూర్తిగా అవగాహన రాహిత్యం ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ అని.. పోటీ చేసిన రెండు చోట్లా ఓటమి పాలైన పవన్కు వచ్చే ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రావన్నారు
తెలుగు దేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ వివేకా హత్య జరిగితే స్పందించని ఆయన ఇప్పుడు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. టీడీపీ హయాంలో వివేకా హత్య కేసు విచారణ ప్రారంభమైందని., విచారణలో జగన్, సంబంధించిన వ్యక్తుల పాత్ర ఉంటే అప్పుడే కేసు నమోదు చేసేవారన్నారు. తండ్రి హత్య కేసు విచారణపై వివేకా కుమార్తె ఢిల్లీలో సీబీఐని ప్రశ్నిస్తే దానికి రాష్ట్ర ప్రభుత్వంకు సంబంధం ఏమిటని అన్నారు. వివేకా హత్య విచారణ కేసును వై కాపా ప్రభుత్వం విచారణ చేయట్లేదని మాట్లాడడం పవన్ అవగాహనా రాహిత్యమే అని అన్నారు.
తాజా ఎన్నారై వార్తల కోసం : https://www.vaartha.com/news/nri/