కేసీఆర్ సర్కార్ ఫై కిషన్ రెడ్డి ఆగ్రహం..ధాన్యం సేకరణపై కేసీఆర్ సర్కారుది నిర్లక్ష్య వైఖరి

kishan reddy
kishan reddy

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..మరోసారి ధాన్యం సేకరణ విషయంలో తెరాస సర్కార్ ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు. ఢిల్లీ లో మీడియా సమావేశం ఏర్పటు చేసిన కిషన్ రెడ్డి .. ధాన్యం కొనుగోలు అంశంలో రైతులు నష్టపోతున్నారని, రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని కేంద్రం ఎన్నోసార్లు కోరిందని వెల్లడించారు. ధాన్యం సేకరణపై ఆరుసార్లు గడువు పెంచినా రాష్ట్ర ప్రభుత్వం బియ్యం ఇవ్వలేకపోయిందని ఆరోపించారు. 2021-22 సీజన్ లో ఖరీఫ్, యాసంగి ధాన్యాన్ని సకాలంలో ఎఫ్ సీఐకి ఇవ్వలేకపోయిందని తెలిపారు.

రైతుల క్షేమం కోసం స్పందించాలని కోరినా, కేసీఆర్ సర్కారు మొండికేసిందని, ధాన్యం సేకరణపై కాలయాపన చేసిందని మండిపడ్డారు. 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఇస్తామని చెప్పారని, మరి ఇస్తారో లేదో తెలియడంలేదని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకోవడానికి సిద్ధంగా ఉందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈరోజు వరకు కూడా కనీసం గోనె సంచులను కూడా ప్రొక్యూర్మెంట్ చేయడం లేదని విమర్శించారు. తూకం వేసే కాంటాలు లేవని, వర్షం వస్తే టార్పలిన్లు కూడా ఒక్క మార్కెట్ యార్డ్ లో కూడా లేవని విమర్శించారు.