కేటీఆర్ ట్వీట్ కు కౌంటర్ ఇచ్చిన కిషన్ రెడ్డి

kishan reddy
kishan reddy

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ కు కౌంటర్ ఇచ్చారు. దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలపై రీసెంట్ గా కేటీఆర్ ట్వీట్ చేసారు. ఈ ట్వీట్ ఫై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. దేశంలో అత్యధిక పెట్రోల్, డిజీల్ ధరలు ఉన్నది తెలంగాణలోనే…అయితే అత్యధిక వ్యాట్ వసూలు చేస్తున్నది కూడా తెలంగాణనే అంటూ కౌంటర్ ఇచ్చారు.

దేశంలో ఇతర రాష్ట్రాల యావరేజ్ గా వ్యాట్ 6.99శాతం ఉంటే తెలంగాణలో మాత్రం 7.66శాతం ఉందన్నారు. దేశ వ్యాప్తంగా నిరుద్యోగ శాతం తగ్గుతుంటే తెలంగాణలో మాత్రం పెరుగుతుందన్నారు. ఒక్క కుటుంబంలో మాత్రమే ఉద్యోగ శాతం పెరిగిందని విమర్శించారు. పోలీసులు వేధింపులు కూడా తెలంగాణలోనే ఎక్కువున్నాయన్నారు. దీనిపట్ల కేటీఆర్ ఎలా స్పందిస్తారో చూడాలి.

మరోపక్క ఖమ్మం బీజేపీ కార్యకర్త సాయిగణేష్‌ ఆత్మహత్యపై సీబీఐ విచారణకు డిమాండ్‌ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిరసన ర్యాలీలకు తెలంగాణ బీజేపీ పిలుపునిచ్చింది. అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన ర్యాలీలు చేపట్టనుంది. ప్రజాసంగ్రామ యాత్ర చేపడుతున్న టీబీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ పాదయాత్ర శిబిరం వద్దనే నిరసన దీక్ష చేపట్టనున్నారు. ఈరోజు తెలంగాణ గవర్నర్‌ తమిళిసైని రాష్ట్ర బీజేపీ నేతల బృందం కలవనుంది.