సమర్థుడైన నేతను ఎన్నుకోవాలి: కిషన్ రెడ్డి

హుజూరాబాద్ పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు భారీగా తరలి రావాలి: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

హుజూరాబాద్ : హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ట్విట్టర్ లో స్పందించారు. నేడు జరిగే ఉప ఎన్నికలో ఓట్లు వేసేందుకు ప్రజలు భారీగా తరలి రావాలని పిలుపునిచ్చారు. ఉన్నతమైన పాలన కోసం సమర్థుడికి ఓటు వేయాలని సూచించారు.

కాగా, హుజూరాబాద్ టౌన్ లో హనుమాన్ ఆలయం వద్ద డబ్బులు పంచుతున్న ఓ వ్యక్తిని బీజేపీ నేతలు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అతడు హుజూరాబాద్ కు చెందిన వ్యక్తి కాడని బీజేపీ శ్రేణులు వెల్లడించాయి. తెలంగాణ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ శశాంక్ గోయల్ హుజూరాబాద్ నియోజకవర్గంలోని పోలింగ్ బూత్ లను పరిశీలించారు. అటు, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ పీఆర్ఓను చైతన్య నెంబర్ ప్లేట్ లేని వాహనంలో తిరుగుతున్నాడంటూ మర్రిపల్లిగూడెంలో అతడిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించినట్టు తెలుస్తోంది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/