పవన్‌ కల్యాణ్‌తో బిజెపి నేతల సమావేశం

గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో సమావేశానికి ప్రాధాన్యత

pawan kalyan
pawan kalyan

హైదరాబాద్‌: బిజెపి అగ్రనేతలు కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌ ఈ మధ్యాహ్నం జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ను కలిశారు. జనసేన నేత నాదెండ్ల మనోహర్ నివాసంలో ఈ సమావేశం జరిగింది. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్న జనసేన… బిజెపితో పొత్తుకు ఆసక్తి చూపుతుండగా, బిజెపి తెలంగాణ చీఫ్ బండి సంజయ్ మాత్రం తమకు ఎవరితోనూ పొత్తు లేదని నిన్న స్పష్టం చేశాడు. పవన్ కల్యాణ్, బండి సంజయ్ చర్చలు జరుపుతారని జనసేన పార్టీ ప్రకటన చేయడంతో పొత్తు విషయంలో గందరగోళం ఏర్పడింది. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ ను కిషన్ రెడ్డి, లక్ష్మణ్ లు కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/