కిరణ్ అబ్బవరం మరో సినిమాకు శ్రీకారం చుట్టబోతున్నాడు

కిరణ్ అబ్బవరం స్పీడ్ చూసి మిగతా హీరోలు కుళ్లుకుంటున్నారు. వరుస పెట్టి సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు. హిట్ , ప్లాప్ లతో సంబంధం లేకుండా కిరణ్ అబ్బవరం తో సినిమాలు చేసేందుకు నిర్మాతలు పోటీపడుతూనే ఉన్నారు. రీసెంట్ గా ‘వినరో భాగ్యము విష్ణు కథ’ సినిమా తో వచ్చి సూపర్ హిట్ అందుకున్న కిరణ్..ఇప్పుడు మీటర్ అంటూ మరో ఏప్రిల్ 07 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. క్లాప్ – మైత్రీ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకి, రమేశ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఒక విభిన్నమైన కథాంశంతో ఈ సినిమా తెరకెక్కినట్లు తెలుస్తుంది.

ఈ సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉండగానే రేపు గురువారం మరో సినిమా ప్రారభించబోతున్నారు. శివమ్ బ్యానర్ పై రవి – రాకేశ్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కెరియర్ పరంగా కిరణ్ అబ్బవరం చేసే 9వ సినిమా ఇది. హైదరాబాద్ .. రామానాయుడు స్టూడియోలో ఉదయం 7: 45 నిమిషాలకు ఈ సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకోనుంది. గతంలో కొన్ని సినిమాలకి రైటర్ గా పనిచేసిన విశ్వకరుణ్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాతో కథనాయికగా నజియా పరిచయమవుతోంది.