పెయిడ్‌ బ్యాచ్‌ ఫై కిరాక్ ఆర్పీ ఆగ్రహం

కిరాక్ ఆర్పీ…ఇప్పుడు ఈ పేరు మారుమోగిపోతుంది. జబర్దస్త్ షో ద్వారా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న ఆర్పీ..ఆ తర్వాత డైరెక్టర్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అనుకున్నాడు. సీనియర్ నటుడు జెడి చక్రవర్తి తో ఓ సినిమా ప్రారంభించారు. కానీ మధ్య లో ఏమైంది..ఆ సినిమా ఆగిపోయింది. ఆ వెంటనే నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అంటూ సొంతంగా చేపల పులుసు కర్రీ పాయింట్ బిజినెస్‌లోకి అడుగు పెట్టాడు.

కూకట్‌పల్లిలో ప్రారంభించిన ఈ ఫుడ్‌ సెంటర్‌కు రెండు , మూడు రోజుల్లోనే భారీ రెస్పాన్స్ వచ్చింది. పలు యూట్యూబ్ చానెల్స్ వారు పెద్ద ఎత్తున ప్రచారం చేయడం తో ఫుడ్ లవర్స్ , సినీ ప్రముఖులు ఇలా అంత ఆర్పీ పులుసు కోసం పరుగులు పెట్టారు. దీంతో అతి తక్కువ సమయంలోనే భారీ లాభాల్లోకి వెళ్ళింది. రోజుకు రెండు, మూడు లక్షల బిజినెస్ జరిగిందంటే ఆలోచించండి.

కాగా ఈ మధ్యన తన ‘నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు’ రుచి అసలు బాలేదని కొంతమంది పనికట్టుకొని లేని పోని ప్రచారం చేస్తున్నారని కిర్రాక్‌ ఆర్పీ కీలక వ్యాఖ్యలు చేశాడు. తనంటే పడని కొందరు పెయిడ్‌ బ్యాచ్‌ తనపై కుట్ర పన్నారని, అందుకే ఈ విష ప్రచారానికి పాల్పడుతున్నారన్నాడు. ఈ మేరకు తన సోషల్ మీడియా లో ఓ పోస్ట్ పెట్టాడు. ‘నేను జీవితంలో ఎన్నో కష్టాలు పడి ఈ స్థాయికి వచ్చాను. కానీ ఈ మధ్యన కొందరు పెయిడ్‌ బ్యాచ్‌ నా నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఫుడ్‌ సెంటర్‌పై అసత్య ప్రచారం చేస్తున్నారు. మోసం చేసి ఎన్నాళ్లు బిజినెస్ చేయలేరు. నేను ఎంతో నిజాయితీగా వ్యాపారం చేస్తున్నా. షాప్ ఓపెన్ చేసినప్పటి నుంచి ఎంతో మంది కస్టమర్లు రుచి ఎంతో బాగుందంటూ వందలాది మంది కొత్త కస్టమర్లను వెంటపెట్టుకొని మరీ వస్తున్నారు. టెస్ట్ లేకపోతే తన కర్రీ పాయింట్ వద్దకు ఎవరూ రారు. అయితే ఒక్కడు బాగాలేదని నెగెటివ్‌ కామెంట్లు చేయడమంటే ఆ వ్యక్తి ఎంత ఓర్వలేనివాడో ఇట్టే అర్థమవుతుంది. నేను చేపలు పులుసు తయారు చేస్తూ నా కిచెన్ లో ఎన్నో వీడియోలు తీశాను. అవే నా నిజాయతీకి నిదర్శనం. నన్ను ఎవరూ బ్యాడ్ చేయలేరు. ఎంత నెగిటివ్‌ చేస్తే.. నాకు అంత ప్రమోషన్’ అని చెప్పుకొచ్చాడు.