ప్రజల ముందుకు కిమ్ జోంగ్‌ ఉన్

ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభోత్సవంలో పాల్గొన్న కిమ్.. ఉత్తర కొరియా అధికార మీడియా వెల్లడి

 

North Korea's Kim Jong Un
North Korea’s Kim Jong Un

ప్యాంగ్యాంగ్‌: ఉత్తరకొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్  ఆరోగ్యంపై వస్తున్న కథనాలకు తెరపడింది. కిమ్ ప్రజల ముందుకు వచ్చారని ఆ దేశ అధికారిక మీడియా వెల్లడించింది. ఉత్తర ప్యాంగ్యాంగ్ ప్రాంతంలోని ఓ ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభోత్సవంలో కిమ్.. తన సోదరి కిమ్ యో జోంగ్‌తో కలిసి పాల్గొన్నారని పేర్కొంది.  ఈ సందర్భంగా పలువురు సీనియర్ అధికారులు కూడా ఆయన వెంట ఉన్నారని తెలిపింది. కిమ్ రిబ్బన్ కట్ చేస్తున్న ఫొటోను కూడా విడుదల చేసింది.  అయితే, ఈ వార్త ఒక్క ఆ దేశ అధికారిక మీడియాలో రావడం తప్ప, మరే అంతర్జాతీయ న్యూస్ ఏజెన్సీలు దీనిని ధ్రువీకరించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. కిమ్ గత నెల 11 నుంచి ప్రజలకు కనిపించకుండా పోయారు. గుండెకు ఆపరేషన్ చేయించుకున్న తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించిందంటూ కధనాలు హల్చల్ చేసాయి.

తాజా ఇపేపరు వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://epaper.vaartha.com/