ఇద్దరు పిల్లలకు ఉరివేసి.. తల్లి ఆత్మహత్య
శ్రీకాకుళంలో విషాదం
శ్రీకాకుళం జిల్లాలో ఘోరం చోటు చేసుకుంది. తల్లి తన ఇద్దరు పిల్లలను చంపి.. ఆతర్వాత ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన దమ్మలవీధిలో జరిగింది. స్థానికంగా నివాసం ఉంటున్న ధనలక్ష్మి(35) తన ఇద్దరు పిల్లలు సోనియా(11) యశ్వంత్(9)లకు ఉరేసి తాను ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతికి కారణాలను కుటుంబసభ్యులు, స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేపట్టారు.
తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/