రష్యా కు లొంగిపోయిన ఖెర్సన్ నగరం
భేషరతుగా లొంగిపోయి రష్యాకు సహకరించాలని ప్రజలకు మేయర్ పిలుపు
ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం 8వ రోజుకు చేరుకుంది. తాజాగా రష్యా సైన్యం పూర్తి స్థాయిలో ఉక్రెయిన్లోని ఓ నగరాన్ని లొంగదీసుకుంది. 3 లక్షల జనాభా కలిగిన కీలకమైన రేవు నగరం ఖెర్సన్ను స్వాధీనం చేసుకున్నట్టు రష్యా సైన్యం ప్రకటించింది. ఇదే విషయాన్ని స్థానిక పరిపాలనా యంత్రాంగం ధృవీకరించింది. ఇదిలా ఉండగా, రష్యా సైన్యానికి బేషరతుగా లొంగిపోయి సహకరించాలని అక్కడి ప్రజలకు ఖర్కీవ్ నగర మేయర్ పిలుపునిచ్చారు.
తెలంగాణ వార్తల కోసం : ‘ https://www.vaartha.com/telangana/