జీవో నెం.1పై ఏపీ హైకోర్టు కీలక ఆదేశం

ఏపీలో రీసెంట్ గా రాష్ట్ర ప్రభుత్వం జీవో 1 ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ జీవో ఫై ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తుంది. రోజు రోజుకు ఓ వివాదం గా ఈ జీవో 1 మారుతుంది. ఈ క్రమంలో ఈ జీవో ఫై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసారు.

దీంతో హైకోర్టు ఈరోజు కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర సర్కార్ తీసుకొచ్చిన ఈ జీవో ను ఈనెల 23 వరకు సస్పెండ్‌ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా జీవో నం.1 ఉందని అభిప్రాయపడిన ధర్మాసనం.. కౌంటర్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిపై తదుపరి విచారణను ఈనెల 20కి వాయిదా వేసింది.