నేడు సీఎం జ‌గ‌న్ తో మంత్రుల కీల‌క‌ సమావేశం

అమరావతి : నేడు సీఎం జగన్ తో మంత్రుల క‌మిటీ కీల‌క‌ స‌మావేశం జ‌రుగ‌నుంది. అయితే ప్రభుత్వ ఉద్యోగుల సమ్మె నేడు కొలిక్కి వచ్చే అవకాశముంది. నిన్న మంత్రుల కమిటీతో సుదీర్ఘంగా చర్చించిన ఉద్యోగ సంఘాలు నేడు మరోసారి భేటీ అయి సమ్మె పై నిర్ణయం తీసుకోనున్నాయి. కాగా నిన్న సుదీర్ఘంగా ఉద్యోగ సంఘాలతో చర్చించిన సారాంశాన్ని మంత్రుల కమిటీ ముఖ్యమంత్రి జగన్ కు మరికాసేపట్లో వివరించనుంది. మంత్రుల కమిటీ జగన్ తో భేటీ అయి ఉద్యోగులు పెట్టిన డిమాండ్లను వివరించనుంది. అయితే దాదాపు ఉద్యోగ సంఘాల డిమాండ్లలో అత్యధిక భాగం వాటిలో మంత్రుల కమిటీ నిన్న‌నే స్పష్టత ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. దాదాపు ఆరు గంటల పాటు జరిగిన ఈ సుదీర్ఘ భేటీలో మంత్రుల కమిటీ ఇచ్చిన హామీల పట్ల ఉద్యోగ సంఘాలు కూడా సంతృప్తి చెందినట్లే కనిపిస్తుంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/