గవర్నర్‌పై ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

గవర్నర్ తమిళసై ఫై ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. గత కొద్దీ నెలలుగా గవర్నర్ కు తెలంగాణ ప్రభుత్వానికి మధ్య వార్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం తనకు సముచిత గౌరవం ఇవ్వటం లేదని.., కనీసం ప్రోటోకాల్ కూడా పాటించటం లేదని పలుమార్లు గవర్నర్ తమిళ సై ఆరోపించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటె తాజాగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి..గవర్నర్ ఫై పలు వ్యాఖ్యలు చేసారు.

గవర్నర్‌ తమిళిసై గవర్నర్‌గా కాకుండా బీజేపీ అనుబంధ విభాగం మహిళా మోర్చా అధ్యక్షురాలిగా పనిచేస్తున్నట్లుగా ఉందని ఆయన విమర్శించారు. గతంలో ఎమ్మెల్సీ కవిత ఇంటిపై బీజేపీకి కార్యకర్తలు దాడి చేస్తే సాటి మహిళగా గవర్నర్ స్పందించలేదని అన్నారు. ఇప్పుడు మాత్రం బీజేపీ ఎంపీ అర్వింద్‌ ఇంటిపై దాడి ఘటనపై వెంటనే నివేదికలు ఇవ్వాలని పోలీసులను ఆదేశించటంతో ఆమె పనితీరు బయటపడిందని అన్నారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో కొనసాగుతూ.. రాజ్‌భవన్‌ని రాజకీయ భవన్‌గా మార్చి తమిళిసై గవర్నర్‌ పదవికి మచ్చ తెస్తున్నారని ఆక్షేపించారు.