వివాదస్పద వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి

వివాదస్పద వ్యాఖ్యలు చేసి ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి వార్తల్లో నిలిచారు. ధర్మవరంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే..ఉదయం నేను , మధ్యాహ్నం నా భార్య , సాయంత్రం నా తమ్ముడు ఇలా మా కుటుంబమంతా రోజు మీ ఇళ్ల చుట్టూ తిరుగుతూ మీకు చాకిరీ చేస్తున్నామంటూ జనం పై అసహనం వ్యక్తం చేశారు. ఇలా మా ఇంటిల్లిపాది మీకే చాకిరీ చేస్తున్నామని.. అయినా లోకేష్ లాంటి పనికిమాలిన వాడు విమర్శలు చేస్తుంటాడని సంచలన వ్యాఖ్యలు చేశారు.

మొన్న పరోటా, పుల్కాలు ఇద్దరు పాదయాత్ర చేశారని.. నాపై అనవసరమైన విమర్శలు చేశారని ఆగ్రహించారు. టిడ్కో ఇళ్లు నేను కట్టిస్తే వారు కట్టించామంటారు.. ధర్మవరంలో 12 వేల ఇళ్లు కట్టించాను.. తాగునీటి సమస్య లేకుండా చేశానని వివరించారు. చంద్రబాబు హయాంలో ధర్మవరంలో ఒక్క ఇల్లు అయినా కట్టించాడా..! అని నిలదీశారు. ఎవరైనా చదువుకోమని పిల్లలకు చెబుతారన్నారు. కానీ పనికిమాలిన లోకేష్ 20 కేసులు ఉంటే కానీ నా వద్దకు రావద్దు అంటాడని.. వీడు ఒక ముఖ్యమంత్రి కొడుకు.. కాబోయే ముఖ్యమంత్రి అట అంటూ చురకలు అంటించారు.