మా బెజవాడ ప్రజలు మీకు రుణ పడి వుంటారు

విజయవాడలోని చనుమోలు వెంకట్రావు ఫ్లైవోవర్‌పై గోతులు..కేశినేని

Kesineni Nani
Kesineni Nani

విజయవాడ: టిడిపి ఎంపి కేశినేని ఏపి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రోడ్లపై చాలా చోట్ట గోతులు కనపతాయి. ఫ్లై ఓవర్‌పై గోతులను చూడాలంటే విజయవాడలోని చనుమోలు వెంకట్రావు ఫ్లైవోవర్‌ (సీవీఆర్‌)కు వెళ్లాల్సిందే’ అంటూ విమర్శించారు. ఆ ఫ్లైఓవర్‌ను బాగు చేయాలని ఆయన కోరారు. ‘ఈ ఫ్లైఓవర్ ను కొంచం మరమ్మతులు చేయించండి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ గారు. మా బెజవాడ ప్రజలు మీకు రుణ పడి వుంటారు’ అని కేశినేని నాని ట్వీట్ చేశారు. కాగా, విజయవాడ మీదుగా వెళ్లే ప్రధాన జాతీయ రహదారులను నగరం వెలుపల నుంచి ఇన్నర్‌ రింగ్‌ మార్గంలో అనుసంధానించే అతి ముఖ్యమైన ఫ్లైవోవర్‌ ఇదని, అటువంటి దానిపై రోడ్డు తక్కువగా ఉందని, గోతులు ఎక్కువగా ఉన్నాయని, కాంక్రీటు కొట్టుకుపోయి బయటపడిన చువ్వల వల్ల ప్రమాదం పొంచి ఉంటుందని చెప్పారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/