బిజెపియేతర పార్టీలకు కేజ్రీవాల్‌ పిలుపు

రైలు బిల్లులను వ్యతిరేకించండి..సిఎం కేజ్రీవాల్‌

cm-arvind-kejriwal

న్యూఢిల్లీ: ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ బిజెపియేతర పార్టీలకు పిలుపునిచ్చారు. వ్యవసాయ రంగానికి సంబంధించి కేంద్రం రాజ్యసభలో ప్రవేశపెట్టిన మూడు బిల్లులను వ్యతిరేకించాలని ఆయన పిలుపునిచ్చారు. ‘కేంద్రం ప్రవేశపెట్టిన మూడు బిల్లులతో పెద్ద కంపెనీల చేతిల్లో రైతులు మోసపోతారు. బిజెపియేతర పార్టీలన్నీ ఏకగ్రీవంగా ఈ బిల్లులను రాజ్యసభలో వ్యతిరేకించాలి. ఎంపీలంతా సభకు హాజరుకావాలి. నాటకీయ పద్ధతిలో వాకౌట్లు చేయవద్దు. దేశంలోని రైతులంతా మిమ్మల్ని (ఎంపీలను) గమనిస్తున్నారు’ అని కేజ్రీవాల్ ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు.

పార్లమెంటులో వ్యవసాయ బిల్లులను ఆమ్ ఆద్మీ పార్టీ వ్యతిరేకిస్తోందని కేజ్రీవాల్ గురువారంనాడే ప్రకటించారు. ఇవి రైతు వ్యతిరేక బిల్లులనీ, దేశవ్యాప్తంగా రైతులు ఈ బిల్లులను వ్యతిరేకిస్తున్నారనీ చెప్పారు. ఈ మూడు చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకోవాలని, తమ పార్టీ మాత్రం ఈ బిల్లులకు వ్యతిరేకంగా ఓటు వేస్తుందని చెప్పారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/