గుండెపోటుతో ఎంపీడీవో మృతి…

తెలంగాణ లో గుండెపోటులు ఆగడం లేదు..ప్రతి రోజు పదుల సంఖ్యలో గుండెలు ఆగిపోతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. నడుస్తూ.. నవ్వుతూ.. ఆడుతూ.. పాడుతూ.. మాట్లాడుతూ..ఇలా కూర్చున్న చోటే కుప్పకూలిపోతున్నారు. తాజాగా.. ఓ ఎంపీడీవో గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయారు.

మేడ్చల్ జిల్లా కీసర మండల పరిషత్ అభివృద్ధి అధికారి (MPDO) కె. రమాదేవి ఆదివారం హార్ట్ఎటాక్‌కు గురై ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్ వనస్థలిపురంలో ఆమె నివాసం ఉండగా.. ఆదివారం సాయంత్రం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అప్రమత్తమైన కుటుంబీకులు ఆమెను వెంటనే మలక్‌పేట యశోద ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే మృతి చెందినట్లు ప్రకటించారు. గతంలో మేడ్చల్ ఎంపీడీవోగా పనిచేసిన రమాదేవి ఆరు నెలల క్రితమే కీసర ఎంపీడీవోగా బదిలీపై వచ్చారు. ఆమెకు ఒక కుమారుడు, కుమర్తె ఉన్నారు. ఆమె మృతితో కుటంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.