స్థానిక సంస్థల ఎన్నికలపై నిఘా పెట్టండి

టిడిపి పార్టీ శ్రేణులకు చంద్రబాబు దిశానిర్దేశం

Chandrababu Naidu
Chandrababu Naidu

అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికలపై టిడిపి నాయకులు, పార్టీ శ్రేణులు ప్రత్యేక నిఘా పెట్టాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. ఏపి రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించిన నేపథ్యంలో ఆయన ఈ మేరకు దిశానిర్దేశం చేశారు. ఈరోజు ఆయన పార్టీ ముఖ్యనాయకులు, కార్యకర్తలతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. డబ్బు, మద్యం పంపిణీ చేసి ఎన్నికల్లో గెలవాలని చూస్తున్న అధికార పార్టీ ఆగడాలను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. డబ్బు, వస్తువులు పంపిణీ చేస్తుంటే వీడియోలు తీసి షేర్‌ చేయాలన్నారు. ఇందుకోసం ఎన్టీఆర్‌ భవన్‌లో టోల్‌ ఫ్రీ నంబర్‌ ఏర్పాటు చేస్తామని, ఎప్పటికప్పుడు తీసిన వీడియోలు, ఇతర సమాచారాన్ని పంపాలని కోరారు. అలా వచ్చిన వాటిని ఎన్నిక అధికారులకు అందజేస్తామన్నారు. యువనాయకత్వం ఎదిగేందుకు స్థానిక సంస్థల ఎన్నికలు మంచి మార్గమని, దీన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/