మూడేళ్ల తర్వాత విజయవాడ కు సీఎం కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్..మూడేళ్ల తర్వాత విజయవాడ లో అడుగుపెట్టబోతున్నారు. అక్టోబరు 14 నుంచి 18 వరకు విజయవాడలో జరిగే సీపీఐ జాతీయ మహాసభల్లో కేసీఆర్ పాల్గొననున్నారు. ఈ విషయాన్ని ఆ పార్టీ సీనియర్‌ నేత చాడ వెంకట్‌రెడ్డి, ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. ఈ సభలకు కేసీఆర్ తో పాటు కేరళ, బిహార్‌ ముఖ్యమంత్రులు పినరయి విజయన్‌, నితీశ్ కుమార్‌‌ లు సైతం హాజరవుతారని వెల్లడించారు.

అలాగే 20 దేశాల నుంచి కమ్యూనిస్టు నేతలతో పాటు సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ఆర్‌ఎస్పీ, ఫార్వర్డ్‌ బ్లాక్‌ నేతలు హాజరవుతారని తెలిపారు. కేసీఆర్ చివరిసారిగా 2019, జూన్ 17న విజయవాడకు వెళ్లారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఏపీ సీఎం జగన్‌ని ఆహ్వానించారు. ఆ సందర్భంలోనే ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. మళ్లీ ఇప్పుడు వెళ్ళబోతున్నారు.