కరోనా.. కెసిఆర్ అత్యున్నతస్థాయి సమావేశం
మధ్యాహ్నం 2 గంలకు ప్రగతి భవన్లో సమావేశం..కీలక ప్రకటన చేసే అవకాశం
హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో సిఎం కెసిఆర్ అధ్యక్షతన అత్యవసర అత్యున్నత స్థాయి సమావేశం జరగనుంది. ఈ రోజు మధ్యాహ్నం 2 గంలకు ప్రగతి భవన్లో ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కరోనాను ఎదుర్కొనేందుకు మరిన్ని కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ సర్కారు నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు సిఎం కెసిఆర్ మరోసారి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం తీసుకుంటోన్న చర్యలకు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. కరోనాను ఎదుర్కొనేందుకు ప్రజలు అన్ని రకాల జాగ్రత్తుల పాటించాలని అన్నారు. ప్రగతి భవన్లో జరగనున్న ఈ సమావేశంలో మంత్రులు, అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో పాటు ఉన్నతాధికారలు పాల్గొననున్నారు. ఈ సమావేశం అనంతరం కీలక సూచనలు చేస్తూ ప్రకటన చేస్తారని తెలిసింది.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/sports/