చిరుమర్తి నర్సింహకు నివాళులర్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్

ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు గురువారం నల్గొండ జిల్లా నార్కట్‌పల్లిలో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తండ్రి సంతాపసభకు హాజరయ్యారు. తండ్రిని కోల్పోయిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను పరామర్శించారు. చిరుమర్తి నర్సింహ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సీఎం కేసీఆర్తో పాటు మంత్రులు కేటీఆర్, జగదీశ్ రెడ్డి, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నివాళులర్పించారు.

ఇటీవల ఎమ్మెల్యే తండ్రి నర్సింహ మృతి చెందగా దశదినకర్మ కార్యక్రమానికి సీఎం హాజరయ్యారు. నార్కట్‌పల్లిలోని రాశి ఫ్యాక్టరీ వద్ద ఏర్పాటు చేసిన సంతాప కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే కుటుంబసభ్యులతో ముఖ్యమంత్రి మాట్లాడారు. వారికి తన సానుభూతి వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా 700మందితో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.