దళితులను అత్యున్నత స్థాయికి చేర్చడమే కెసిఆర్ సంకల్పం

హైదరాబాద్ : రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శనివారం సికింద్రాబాద్ లోని హరిహర కళాభవన్ హైదరాబాద్ జిల్లా పరిధిలోని నియోజకవర్గ దళిత బంధు లబ్ధిదారులకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు. ఈసందర్బంగా ఆయన మాట్లడుతూ …అంటరాని తనాన్ని రూపుమాపాలి… దళితులు ఆర్ధికంగా అభివృద్ధి సాధించాలనేది ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు లక్ష్యమ‌నివెల్లడించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 74 సంవత్సరాలు దాటినా దళితులు అభివృద్ధికి నోచుకోలేదని, దళితులను అత్యున్నత స్థాయికి చేర్చాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు పథకానికి శ్రీకారం చుట్టారని వివరించారు. దళిత బంధు కింద‌ ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమం క్రింద లబ్ధిదారులు ఎంచుకున్న రంగంలో అవసరమైన శిక్షణ ఇచ్చి ఆయా రంగాల్లో రాణించేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని తెలిపారు.

మొదటి దశలో ఒక్కో నియోజకవర్గ పరిధిలో 100 మందికి దళితబంధును ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. రెండో విడతలో ఒక్కో నియోజకవర్గ పరిధిలో 1500 మందికి ఈ కార్యక్రమం వర్తింప చేయడం జరుగుతుందని మంత్రి తెలిపారు. ఇంతటి సాహసోపేత కార్యక్రమం దేశంలో ఎక్కడా అమలు కావడం లేదని పేర్కొన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్క‌ర్, బాబు జగ్జీవన్ రామ్ ఆశయాల సాధన కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. దళితులు సంఖ్యాపరంగా అత్యధికంగా ఉన్నప్పటికీ, సామాజికంగా ఎంతో వెనుకబడిపోయారన్నారు. వారు అభివృద్ధి సాధించేందుకు ప్రభుత్వం అనేక విధాలుగా ప్రోత్సహిస్తుందన్నారు. దళిత పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్న విషయాన్ని గుర్తుచేశారు. ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు అయినా సరే ప్ర‌తి ఒక్క‌ అర్హులైన దళితులకు దళిత బంధు క్రింద ఆర్ధిక సహాయం అందించడం జరుగుతుందని స్పష్టం చేశారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/