వీరయ్య , వీర సింహ రెడ్డి లకు గుడ్ న్యూస్ తెలిపిన తెలంగాణ సర్కార్

kcr

చిత్రసీమ పట్ల నిత్యం సానుకూలంగా ఉండే తెలంగాణ సర్కార్..మరోసారి ఇండస్ట్రీ ఫై ప్రేమను వ్యక్తం చేసింది. సంక్రాంతి బరిలో రాబోతున్న వాల్తేర్ వీరయ్య , వీర సింహ రెడ్డి చిత్రాలకు గుడ్ న్యూస్ తెలిపింది. విడుదల రోజున ఆరో షోలకు పర్మిషన్‌ ఇస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. వీటి ప్రకారం 12న ఉదయం 4 గంటలకే వీరసింహారెడ్డి షోలు పడనున్నాయి. ఆ మరుసటి రోజే అంటే 13న ఉదయం 4 గంటలకే మెగాస్టార్‌ చిరంజీవి వాల్తేరు వీరయ్య షోలు ప్రారంభం కానున్నాయి. అంటే ఒక రోజు పాటు ఆరు షోలు పడనున్నాయి.

మరోపక్క ఏపీ సర్కార్ సైతం ఈ చిత్రాలకు గుడ్ న్యూస్ తెలిపింది.టికెట్ ధరలు పెంచుకునేందుకు ఈ రెండు సినిమాలకు అనుమతి నిచ్చింది. టికెట్ ధరలపై గరిష్ఠంగా రూ.45 వరకు పెంచుకునేందుకు పచ్చజెండా ఊపింది. అయితే ధర పెంపుపై జీఎస్టీ అదనం. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం తాజా ఉత్తర్వులు జారీ చేసింది. రూ.70 వరకు పెంచుకుంటామని చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ కోరగా, ఏపీ సర్కారు రూ.45 వరకు పెంచుకోవచ్చని స్పష్టం చేసింది.

గాడ్ ఫాదర్ తో మెగా హిట్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి..ప్రస్తుతం వాల్తేర్ వీరయ్య గా సంక్రాంతి సందర్బంగా జనవరి 13 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. బాబీ(కేఎస్ రవీంద్ర) డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ లో చిరంజీవి కి జోడిగా శృతి హాసన్ నటిస్తుండగా, రవితేజ కీలక పాత్రలో కనిపించనున్నాడు. కేథరిన్ థ్రెసా, సముద్రఖని, బాబీ సింహా, బిజు మీనన్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చుగా , మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు.

ఇక క్రాక్ ఫేమ్ గోపిచంద్ మలినేని డైరెక్షన్లో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ వీర సింహ రెడ్డి. బాలకృష్ణ హీరోగా నటించిన ఈ మూవీ జనవరి 12 న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా తాలూకా సాంగ్స్ , టీజర్ , ట్రైలర్ ఇలా ప్రతిదీ సినిమా ఫై అంచనాలు రెట్టింపు చేసింది.