మోడీకి మీట‌ర్ పెట్టాలని పిలుపునిచ్చిన కేసీఆర్

తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి మోడీ ఫై నిప్పులు చెరిగారు. సోమవారం పెద్ద‌ప‌ల్లి జిల్లా క‌లెక్ట‌రేట్‌ను ప్రారంభించిన అనంత‌రం అక్క‌డ ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో సీఎం కేసీఆర్ ప్ర‌సంగించారు. ఈ సందర్బంగా మోడీ ఫై నిప్పులు చెరిగారు. 2024లో ఈ దేశం నుంచి బీజేపీని పార‌ద్రోలాల‌ని పిలుపునిచ్చారు. రైతుల‌కు మీట‌ర్ పెట్టాల‌ని అంటున్న ఈ మోదీకే మీట‌ర్ పెట్టాల‌న్నారు.

రాబోయే రోజుల్లో దేశం నుండి ఈ బీజేపీని పార‌దోలి రైతుల ప్ర‌భుత్వం రాబోతుంది. ఈ గోల్ మాల్ ప్ర‌ధాన‌మంత్రి, కేంద్ర ప్ర‌భుత్వం ప‌చ్చి అబ‌ద్దాల ఆడుతూ, దేశ ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తున్నారు. దేశంలోని మొత్తం వ్య‌వ‌సాయానికి వాడే క‌రెంట్ కేవ‌లం 20.8 శాతం మాత్ర‌మే. దాని ఖ‌రీదు ఒక ల‌క్షా 45 వేల కోట్లు.ఓ కార్పొరేట్ దొంగ‌కు దోచిపెట్టినంత కాదు క‌దా మోదీ. రైతుల కోసం మీరు బ‌య‌ల్దేరండి అని ఆయా రాష్ట్రాల రైతులు న‌న్ను కోరారు. మీట‌ర్ లేని రైతు రావాల‌ని కోరారు. భార‌త‌దేశం స్వాగ‌తం ప‌లుకుతుంద‌న్నారు. రైతుల‌కు మీట‌ర్ పెట్టాలని అంటున్న‌ మోదీకి మ‌నంద‌రం క‌లిసి మీట‌ర్ పెట్టాలి. ఆ ప‌ని చేస్తే మ‌న‌కు పీడ పోతదని కేసీఆర్ అన్నారు.

ఇక పెద్దపల్లిలో ఉద్యమ సమయంలో అనేకసార్లు జెండా ఎగురవేశానని గుర్తు చేసుకున్నారు. సింగరేణిలో వేల మందికి ఉద్యోగాలు దొరుకుతున్నాయని తెలిపారు. సింగరేణి కార్మికులకు భారీగా బోనస్‌ అందజేస్తున్నామన్నారు. పెద్దపల్లిలో మున్సిపాలిటీలు ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు.