కేసీఆర్ కుటుంబం కాశీ యాత్ర
నేడు వారణాసిలో గంగాహారతికి హాజరు
Hyderabad: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబ సభ్యులతో కలిసి కాశీ బయలు దేరారు. నేడు, రేపు కాశీలో పర్యటించనున్నారు.
భార్య శోభ, కుమార్తె కవిత ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఆయన నేడు వారణాసిలో గంగాహారతి తిలకిస్తారు. సంకట్ మేచన్ దేవాలయంలో పూజలు నిర్వహిస్తారు. రేపు కాశీ విశ్వేశ్వరుడిని వారు దర్శించుకుంటారు.
తాజా ‘చెలి’ శీర్షికల కోసం : https://www.vaartha.com/specials/women/