కెసిఆర్‌ ఉస్మానియాను సందర్శించాలి

సిఎం కెసిఆర్‌లో మానవత్వం చచ్చిపోయింది…బండి సంజయ్

bandi sanjay
bandi sanjay

హైదరాబాద్‌: బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈరోజు మీడియాతో మాట్లాడుతూ.. ముఖమంత్రి కెసిఆర్‌లో మానవత్వం చచ్చిపోయిందని అన్నారు. ఉస్మానియా ఆస్పత్రిలో రోగుల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ఉస్మానియాలో సౌకర్యాలను మెరుగుపర్చాలని డిమాండ్ చేశారు. సిఎం కెసిఆర్ ఉస్మానియాను సందర్శించాలన్నారు. ఉస్మానియాను పునర్ నిర్మిస్తానని సీఎం కేసీఆర్ మాట తప్పారని మండిపడ్డారు. సచివాలయ నిర్మాణం ఆపి.‌.‌ పేదలకు వైద్యం అందించే ఆసుపత్రులను నిర్మించాలని బండిసంజయ్ డిమాండ్ చేశారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/