‘రాజగోపాల్ అన్న .. తొందరపడకు , మాట జారకు..’ కవిత ట్వీట్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా బిఆర్ఎస్ ఎమ్మెల్సీ , సీఎం కేసీఆర్ కుమార్తె ఈ స్కామ్ లో ఉన్నట్లు ఈడీ నోటీసులు జారీ చేయడం..ఛార్జ్ షీట్ దాఖలు చేయడం తో మరింత హాట్ టాపిక్ అయ్యింది. ఇప్పటికే ఈ స్కామ్ కు సంబదించి కవితను విచారించిన అధికారులు మరోసారి ఛార్జి షీట్ లో ఆమె పేరు చేర్చడం ఇప్పుడు మరోసారి వైరల్ గా మారింది.

కవితతో పాటు వైసీపీ ఎంపీ మాంగుట శ్రీనివాసులురెడ్డి, మాగుంట శ్రీనివాసులురెడ్డి కుమారుడు రాఘవ్‌రెడ్డి, ముత్తం గౌతమ్, అరుణ్ రామచంద్ర పిళ్లై, బోయినపల్లి అభిషేక్ రావు పేర్లు కూడా ఉన్నాయి. దీనిపై బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ట్విట్టర్ లో ప్రస్తావించారు. లిక్కర్ క్వీన్ పేరు ఛార్జ్‌షీట్‌లో 28 సార్లు ఉందని ట్వీట్ చేస్తూ.. ఎమ్మెల్సీ కవిత పేరు ఛార్జ్‌షీట్‌లో నమోదైదంటూ ఓ వార్త కథనాన్ని ట్వీట్‌కు జత చేశారు. రాజగోపాల్ రెడ్డి చేసిన ట్వీట్‌కు ఎమ్మెల్సీ కవిత కౌంటర్ ఇచ్చారు. ఎన్ని సార్లు తన పేరు చెప్పించినా అబద్ధం నిజం కాదని అన్నారు. ‘రాజగోపాల్ అన్న .. తొందరపడకు , మాట జారకు !! ” 28 సార్లు ” నా పేరు చెప్పించినా.. ” 28 వేల సార్లు ” నా పేరు చెప్పించినా.. అబద్ధం నిజం కాదు.’ అంటూ ఎమ్మెల్సీ కవిత కౌంటర్ ఇచ్చారు.