కశ్మీర్‌లో వంట గ్యాస్ నిల్వలు పెంచుకోవాలి

చమురు కంపెనీలకు కశ్మీర్ ప్రభుత్వ ఆదేశాలు

Gas cylinders
Gas cylinders

కశ్మీర్‌: కశ్మీర్‌లోయలో రెండు నెలలకు సరిపడా వంటగ్యాస్‌ నిల్వ చేసుకుని పెట్టుకోవాలని చమురు మార్కెటింగ్ కంపెనీలైన ఎల్జీ, హెచ్పీ గ్యాస్ కంపెనీలను జమ్మూ  కశ్మీర్ ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు 27వ తేదీన రాష్ట్ర ఆహార, పౌర సరఫరాలు, వినియోగదారుల విభాగం డైరెక్టర్ పేరిట ఆదేశాలు వెళ్లాయి. వీటిని అత్యవసర ఆదేశాలుగా పరిగణించాలని కూడా పేర్కొన్నారు. వర్షాకాలం రావడంతో, కశ్మీర్ లోయలో కొండ చరియలు విరిగిపడి, జాతీయ రహదారులను మూసివేయాల్సి వస్తుంది కాబట్టే, గ్యాస్ నిల్వలను పెంచుకోవాలని సూచించామని ప్రభుత్వ వర్గాలు అంటున్నా, ఇరు దేశాల మధ్యా నెలకొన్న ఉద్రిక్త వాతావరణ పరిస్థితుల్లో ఏ క్షణమైనా, ఏదైనా జరుగవచ్చని సోషల్ మీడియాలో పోస్టులు వస్తున్నాయి. ముఖ్యంగా చైనా పక్కా ప్లాన్ తో భారత సైనికులపై దాడికి వచ్చిందని, దాడికి ముందు రోజు సరిహద్దులకు మార్షల్ ఆర్ట్స్ ఫైటర్స్, పర్వతారోహకులను పంపిందని చైనా అధికార మీడియా స్వయంగా వెల్లడించిన తరువాత యుద్ధ భయాలు మరింతగా పెరిగాయి.


తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/