అయ్యన్న పచ్చి తాగుబోతు అంటూ కీలక వ్యాఖ్యలు చేసిన కారుమూరి నాగేశ్వరరావు

వైస్సార్సీపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు..టీడీపీ సీనియర్ నేతలైన బుద్దా వెంకన్న, అయ్యన్న లపై కీలక వ్యాఖ్యలు చేసారు. అయ్యన్న పచ్చి తాగుబోతు అని బుద్దా వెంకన్న అమ్మాయిల బ్రోకర్‌ అని నాగేశ్వరరావు అన్నారు. అయ్యన్నపాత్రుడు విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని.. చట్టానికి ఎవరూ అతీతులు కాదని అన్నారు.

వెన్నుపోటు రాజకీయాలకు కేరాఫ్‌ అ‍డ్రస్‌ చంద్రబాబు. ఆయన బాటలోనే పార్టీ నేతలు నడుస్తున్నారు. మీరు తప్పు చేసి దాన్ని బీసీలపై రుద్దటం ఏంటి?. బీసీ నేతలు తప్పు చేస్తే వదిలేయాలా?. అయ్యన్నపాత్రుడు కబ్జాలపై చూస్తూ ఊరుకోవాలా?. టీడీపీ నేతలు మహిళలు, ఎస్సీల గురించి దారుణమైన వ్యాఖ్యలు చేశారు. బాలకృష్ణ మహిళల గురించి ఎంతటి దారుణమైన వ్యాఖ్యలు చేశారో చూశాం. బుద్దా వెంకన్న పది ఇళ్లు కూల్చుతానంటున్నాడు. బెజవాడలో మహిళలతో కాల్ మనీ సెక్స్ రాకెట్ నడిపిన చరిత్ర అతనిది. రిషితేశ్వరి, వనజాక్షిపై దాడుల కేసుల్లో చంద్రబాబు ఏం చేశారో ప్రజలంతా చూశారు. జగన్ వచ్చాకే బీసీలకు పూర్తి స్థాయి న్యాయం జరుగుతోంది. కానీ చంద్రబాబు బీసీలను ఓట్లేసే యంత్రాలుగానే చూశారని మంత్రి నాగేశ్వరరావు అన్నారు.

విజయవాడలో ఎన్ని గుడులు కూల్చారో జనం చూశారు. మీ షూటింగ్ పిచ్చితో పుష్కరాల్లో జనాన్ని చంపారు. అయ్యన్నపాత్రుడు ఓ తాగుబోతు. చంద్రబాబుకు ధైర్యం ఉంటే ఒంటరిగా పోరాటం చేయాలి. ఉత్తరాంధ్రలో చంద్రబాబు సభకు వచ్చిన జనం జై జగన్ అంటున్నారు. జగన్‌పై పోరాటానికి టీడీపీ వారే రావటం లేదు. ఇక ఇంటికొకరు ఏం వస్తారు?. కేంద్రంపై పోరాటం చేయలేక జగన్‌ని విమర్శిస్తున్నారంటూ నాగేశ్వరరావు నిప్పులు చెరిగారు.